వెంటపడ్డ కోతి ఇంటిపై నుంచి జారీపడి మహిళ మృతి

Submitted by Degala Veladri on Mon, 19/09/2022 - 22:07

వెంటపడ్డ కోతి  ఇంటిపై నుంచి జారీపడి మహిళ మృతి 

బోనకల్,సెప్టెంబర్ 19, ప్రజాజ్యోతి:

కోతుల బెడద మండల వ్యాప్తంగా విపరీతంగా పెరిగిపోయింది, కొన్ని కోతుల గుంపు పంటలను నాశనం చేస్తుంటే, మరి కొన్ని జనఆవసల్లోకి చేరి ప్రాణాల మీదకు తీసుకు వస్తున్నాయి. కోతి వెంటపడుతుందనే భయంతో క్రింద పడి మృతి చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మండలం పరిధిలోని రాయన్నపేటలో గ్రామంలో యంగల మరియమ్మ, అనే మహిళ బట్టలు ఆరేసెందుకు ఇంటిపైకి వెళ్లింది.ఆ సమయంలో అక్కడే ఉన్న కోతి ఒకటి ఆమెపై దాడి చేయటానికి ప్రయత్నించింది. కోతి దాడినుంచి తప్పించుకుని కిందకు పరుగెత్తే క్రమంలో ఇంటి పైనుంచి కింద పడటంతో ఆమె నడుముకి దెబ్బ తగలడంతో తీవ్రగాయాలు కావటంతో ఖమ్మంలోని ఓ హాస్పిటల్ లో చేర్పించి చికిత్సను అందించారు. 15 రోజుల నుండి చికిత్సపొందుతూ ఈ రోజు మృతి చెందింది. ఆ కుటుంబం కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.కోతుల బెడద నుంచి అధికారులు మండల ప్రజలను రక్షించాలని వారు అవేదన వ్యక్తం చేస్తున్నారు.