శెట్టి బలిజ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా అట్లతద్ది

Submitted by Srikanthgali on Wed, 12/10/2022 - 20:28
Under the leadership of the Shetty Balija Sangam, it was solemnly celebrated

శెట్టి బలిజ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా అట్లతద్ది

కొత్తగూడెం క్రైమ్, అక్టోబర్ 12, ప్రజాజ్యోతి: తెలంగాణకు బతుకమ్మ ఎంత పవిత్రమో, ఆంధ్ర ఆడపడుచులకు అట్లతద్ది అంత పవిత్రమైందని పదో వార్డ్ కౌన్సిలర్ మునిగడప పద్మ పేర్కొన్నారు . రామవరం శెట్టిబలిజ సంఘం ఆధ్వర్యంలో గోదం వాగు వద్ద జరిగిన అట్లతద్ది కార్యక్రమంలో పాల్గొన్న మునిగడప పద్మ మాట్లాడుతూ అట్లతద్ది నూతనంగా వివాహం చేసుకున్న మహిళలకు వాయనాలు తీర్చే అతి పవిత్రమైన పండుగని పేర్కొన్నారు. అట్లతద్దోయ్, ఆరట్లోయ్, ముద్దపప్పు ఓయ్, మూడట్లోయి అని ఒక మహాకవి పుస్తకాల్లో రాసిన, మేము చదువుకున్న విషయాలు గుర్తుకొస్తున్నాయని ఆమె అన్నారు. ఈరోజు మహిళలు తెల్లవారుజామున లేసి పూజలు చేసుకొని ,ఒక్కపొద్దు ఉండి ,గోదం వాగుకు చేరుకొని భక్తి, శ్రద్ధలతో వాగులో గౌరమ్మలను వదిలి పూజిస్తారని అనంతరం ఉయ్యాలలూగి ఆత్మీయతతో పలకరించుకోవడం సంతోషించదగ్గ విషయమని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో శెట్టిబలిజ సంఘం నాయకులు దొమ్మేటి నాగేశ్వరరావు, రాయుడు నాగేశ్వరరావు, కట్ట సత్యనారాయణ ,ప్రకాష్ రావు, దొంగ కొండ, మహిళలు తదితరులు పాల్గొన్నారు.