ఎమ్మెల్యే ఫైళ్ల రైతు భీమా చెక్కు అందజేత
భువనగిరి, సెప్టెంబర్ 07 (ప్రజా జ్యోతి)భువనగిరి మండలం కేసారం గ్రామానికి చెందిన రైతు రాజబోయిన పోచయ్య ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు బీమాకు దరఖాస్తు చేసుకోవడంతో 5,00,000 లక్షలు రూపాయలు మంజూరు కావడం జరిగింది. ఈరోజు భువనగిరి శాసన సభ్యులు ఫైళ్ల శేఖర్ రెడ్డి చేతుల మీదుగా నామిని అయినా రాజబోయిన పద్మకు చెక్కు అంద జేయడం జరిగింది. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతు సంక్షేమమే టిఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయం అని ముఖ్యమంత్రి కేసీఆర్ బంధావుడు అన్నారు. రైతు పక్షపాతిగా రైతు భీమాలాంటి పథకం రైతులకు తీసుక రావడం వలన రైతుల కుటుంబాలకు ఆర్థికంగా ప్రయోజనం చేకూరుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ సుబ్బురు బీరుమల్లయ్య , మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు కంచి మల్లయ్య,ఎంపీపీ రాసాల నిర్మల , తెరాస మండల అధ్యక్షుడు జనగాం పాండు, చందుపట్ల మాజీ సింగిల్ విండో చైర్మన్ బాల్గురి మధుసూదన్ రెడ్డి,మున్సిపాల్ కో ఆప్షన్ మెంబర్ రాచమళ్ళ రమేష్ ,తెరాస జిల్లా నాయకులు గౌరారం నరేష్, అనంతరం సర్పంచ్ చిందం మల్లికార్జున్,ఎంపీటీసీ సామల వెంకటేష్, మచ్చ వెంకటేష్, అనాజీపురం గ్రామ శాఖ బతుక అశోక్, పోలా ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.