ద్విచక్ర వాహనం ఢీకొని వ్యక్తీ మృతి

Submitted by Degala Veladri on Thu, 15/09/2022 - 10:11
A person died after being hit by a two-wheeler
మృతి చెందిన డీలర్ భర్త చిలక వెంకటరత్నం

​​​​​​

​​​​​​బోనకల్, సెప్టెంబరు 14, ప్రజాజ్యోతి: రోడ్డు దాటుతుండగా ద్విచక్ర వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందిన సంఘటన మండలంలోని మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది,స్థానికులు తెలిపిన వివరాల మేరకు,జానకీపురం గ్రామానికీ చెందిన చిలక వెంకటరత్నం (50),భార్య రేషన్ డీలర్,ఇద్దరు కుమారులు,తన చిన్న కుమారుడు భరత్ తో కలిసి పని నిమిత్తం బోనకల్ వచ్చారు.పని ముగించుకొని ఇంటికి తిరిగి వస్తున్న క్రమంలో రావినూతల వద్ద గల హెచ్ పి పెట్రోల్ బంక్ దగ్గరలో గల తైవాన్ మెకానిక్ షాప్ దగ్గరకు వెళ్ళేందుకు తన బైక్ ను అక్కడే ఉన్న కుమారుడి వద్ద విడిచి పెట్టీ షాప్ వద్దకు వెళ్ళేందుకు రోడ్డు దాటుతున్న క్రమంలో బోనకల్ వైపు నుంచి లక్ష్మీపురం వెళ్ళేందుకు దారెల్లి నరేష్ తండ్రీ నాగేశ్వరరావు Ap29Q9110(పల్సర్) బైక్ పై తన కుటుంబ సభ్యులతో కలిసి అతివేగంతో వచ్చి వెంకట రత్నంను ఢీ కొట్టడంతో వెంకటరత్నం అక్కడే రోడ్డుపై పడడంతో తన తల వెనుక భాగంలో తీవ్ర గాయాలపాలవ్వడంతో హుటాహుటిన అతన్ని ఖమ్మం లోని ఓ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.చికిత్స పొందుతూ బుదవారం తెల్లవారు జామున వెంకటరత్నం మృతి చెందాడు.వెంకటరత్నం మృతి పట్ల గ్రామ సర్పంచ్ చిలక వెంకటేశ్వర్లు,మండల రేషన్ డీలర్లు సంఘం తమ తీవ్ర ద్రిగ్భంతి వ్యక్తం చేస్తు సంతాపం తెలిపారు.వెంకట రత్నం మృతితో గ్రామంలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలముకున్నాయి. వెంకటరత్నం మృతదేహాన్ని తెరాస జిల్లా నాయకులు డాక్టర్ కోటా రాంబాబు పరామర్శించి భౌతిక కాయంవద్ద నివాళులర్పించారు.వెంకటరత్నం చిన్న కుమారుడు భరత్ ఇచ్చిన పిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.