బీఎస్పీ ఆధ్వర్యంలో పెరియార్ రామస్వామి జయంతి వేడుకలు
బోనకల్, సెప్టెంబర్ 17 , ప్రజాజ్యోతి:
బహుజన్ సమాజ్ పార్టీ మధిర నియోజకవర్గ ఇంచార్జ్ దామెర్ల పృద్వి ఆధ్వర్యంలో బోనకల్ మండలకేంద్రంలో పెరియార్ రామస్వామి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.బహుజన్ సమాజ్ పార్టీ మధిర అసెంబ్లీ ఇంచార్జ్ దామెర్ల పృద్వి మాట్లాడుతు ఈరోడ్ వెంకటప్ప రామసామి పెరియార్ లేదా థాంథై పెరియార్ గా గౌరవించబడిన భారతీయ సామాజిక కార్యకర్త మరియు రాజకీయ నాయకుడు, ఆత్మగౌరవ ఉద్యమాన్ని మరియు ద్రవిడర్ కజగాన్ని ప్రారంభించిన ద్రావిడ ఉద్యమ పితామహుడు తమిళనాడులో బ్రాహ్మణ ఆధిపత్యం మరియు లింగ మరియు కుల అసమానతలకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన మహానియూడు పెరియార్ రామస్వామి జయంతి వేడుకను ఘనంగా నిర్వహించడం జరిగిందని కొనియాడారు.ఈ కార్యక్రమంలో బోనకల్ మండల అధ్యక్షుడు గంధం వంశి,బోనకల్ మండల ఉపాధ్యక్షుడు అంతోటి శివ కృష్ణ,చింతకాని మండల అధ్యక్షుడు రమేష్ దారెల్లి, ఐటీసెల్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు కళ్యాణ్ కనకపూడి కృష్ణార్జునరావు సాంబర్తి ప్రణయ్ నిమ్మతోట ఉపేంద్ర వీరయ్య తదితరులు పాల్గోన్నారు.