నాంపల్లి, అక్టోబర్ 2(ప్రజాజ్యోతి ): మండల కేంద్రంలో పలు గ్రామాలకు చెందిన మత్స్యకారులకు ఆదివారం నాడు చేపపిల్లల పంపిణీ కార్యక్రమంలో మండల ఎంపీపీ ఏడుదొడ్ల శ్వేతా రవీందర్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని మత్స్యకారులకు చేప పిల్లలను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ సమైఖ్య రాష్ట్రంలో మత్స్యకారులను పట్టించుకోకుండా గత ప్రభుత్వాలు మోసం చేశాయని, తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్ ప్రభుత్వం ప్రతి ఏటా మత్స్యకారులకు ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేసి ఉపాధి కల్పిస్తున్నారని అన్నారు.ఈ కార్యక్రమంలో మత్స్యశాఖ సిబ్బంది మరియు పలు గ్రామాల మత్స్యకారులు పాల్గొన్నారు.
- 2 views