గూడూరు అక్టోబర్ 02 (ప్రజా జ్యోతి): కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి అన్ని విధాలా కృషి చేస్తానని గూడూరు మండలం నూతనంగా ఎన్నికైన యూత్ అధ్యక్షుడు మధు అన్నారు. గూడూరు మండలంలోని పొనుగోడు గ్రామానికి చెందిన బొల్లికొండ మధును రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేన రెడ్డి ఆదేశాల మేరకు జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కంకర అయ్యప్ప రెడ్డి నియమించినట్లు తెలిపారు. మధు గత 7సంవత్సరాలుగా మండల యూత్ ఉపాధ్యక్షుడుగా పని చేసినందున వారికి మండల యూత్ కాంగ్రెస్ అద్యక్ష పదవి ఇచ్చినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ నాపై ఎంతో నమ్మకంతో యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్ష పదవి ఇచ్చినందుకు మండలంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి అహర్నిశలు కృషి చేస్తానని,అందరిని కలుపుకుని ముందుకు వెళ్తానని తెలిపారునాకు మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్ష పదవి రావడానికి ప్రత్యేకంగా కృషి చేసిన పెద్దలు నర్సంపేట మాజీ శాసనసభ్యులు, ఏఐసిసి సభ్యులు దొంతి మాధవరెడ్డి కి,రాష్ట్ర ఉపాధ్యక్షులు వేం నరేందర్ రెడ్డి కి,జిల్లా అధ్యక్షులు జెన్నారెడ్డి భరత్ చందర్ రెడ్డి కి, బలరాం నాయక్ కి, మురళి నాయక్ కి, నియోజకవర్గ యూత్ అధ్యక్షుడు గందసిరి శ్రావణ్ కి మండల నాయకులకు ధన్యవాదాలు తెలిపారు.
- 8 views