నడిగూడెం, సెప్టెంబర్ 28, ప్రజా జ్యోతి: మండలంలో రెండు రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలకు మండల కేంద్రంలో ఎగువ నుంచి వస్తున్న వరదలకు చెరువు అలుగు పోసి గ్రామంలో కొన్ని వీదులు,గృహాలు జలమయమైన కారణంగా స్థానిక శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ ఆదేశానుసారం ఎంపీపీ యాతాకుల జ్యోతి మధుబాబు వరద నివారణ సహాయ చర్యల భాగంగా అధికారులను స్థానిక ప్రజాప్రతి నిధులను అప్రమత్తం చేసి గ్రామంలో అధికారులు ప్రజాప్రతినిదులతో గురువారం వరద ప్రాంతాలను పరిశీలించి తగు చర్యలు తీసుకోవడం జరిగింది. కార్యక్రమం లో స్థానిక సర్పంచ్ గడ్డం నాగలక్ష్మి మల్లేష్ యాదవ్, తహసిల్దార్ టీ నాగేశ్వరరావు, ఎంపీడీవో ఎం ఎర్రయ్య, ఎంపీఓ లింగారెడ్డి, కార్యదర్శి మల్లారెడ్డి, గ్రామపంచాయతీ సిబ్బంది స్థానిక నాయకులు ప్రజలు పాల్గొన్నారు...
- 2 views