అడ్డగుడూర్ సెప్టెంబర్ 28( ప్రజా జ్యోతి న్యూస్): ఉమ్మడి నల్లగొండ జిల్లా డిసిఎంఎస్ చైర్మన్ వట్టె జానయ్య యాదవ్ జన్మదినం సందర్భంగా అడ్డగూడూరు మండల కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద యాదవ సంఘం నాయకులు మంటిపల్లి సతీష్ యాదవ్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ,స్వీట్లు పంచి ఘనంగా పుట్టినరోజు వేడుకలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పలువురు యాదవ సంఘం నాయకులు మాట్లాడుతూ యాదవ కుటుంబంలో పుట్టిన వ్యక్తి గొప్ప నాయకుడుగా ఎదుగుతూ తెలంగాణ ఉద్యమంలో తన వంతుగా కీలకపాత్ర పోషించి 2001లో రాజకీయ ప్రవేశం చేసి ఉప సర్పంచ్ గా, సర్పంచిగా, రెండుసార్లు ఎంపీపీగా ప్రస్తుతం ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీస్సులతో మంత్రి జగదీశ్ రెడ్డి అండదండలతో డీసీఎంఎస్ చైర్మన్ గా ప్రజలకు సేవ చేస్తూ ఓటమి ఎరగని నాయకుడు జానన్న అని కొనియాడారు. ఆయన రానున్న భవిష్యత్తులో ఉన్నత పదవులు పొంది. యాదవుల సంక్షేమనికి, ఉమ్మడి నల్గొండ జిల్లా అభివృద్ధికి తన వంతుగా కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ననుబోతు మల్లేష్, కంబాల బద్రి,మార్తా రమేష్, మంటిపల్లి గంగయ్య, పిల్లి గంగయ్య, బర్రు అనిల్,ఎలేందర్, మచ్చగిరి, చరణ్,బన్నీ, ప్రవీణ్, నర్సయ్య,తదితరులు పాల్గొన్నారు.
- 2 views