పలిమెల సెప్టెంబర్ 26 ప్రజాజ్యోతి../.. పాలిమెల తహశీల్దార్ కార్యాలయంలో చాకలి ఐలమ్మ 127 వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు .చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ స్రవంతి మాట్లాడుతూ నాగరికత కు నడక నేర్పిన కులం దెబ్బతింటుందని, ఒకరిపై ఒకరు ఆధారపడి బతికే ఉత్పత్తి కులాలు కనుమరుగైతే పెను ప్రమాదం అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిడివో ప్రకాశ్ రెడ్డి, తహశీల్దార్ కార్యాలయ సిబ్బంది ఎంపీడీవో సిబ్బంది పలువురు పాల్గొన్నారు
- 3 views