జాతీయ సమైక్యత ర్యాలీ జయప్రదం చేయండి - ఎంపీపీ మాడుగుల ప్రభాకర్ రెడ్డి

Submitted by krishna swamy on Fri, 16/09/2022 - 11:16
National Unity Rally Jayapradam - MPP Madugula Prabhakar Reddy

భూదాన్ పోచంపల్లి, సెప్టెంబర్ 15 (ప్రజా జ్యోతి).తెలంగాణ జాతీయ సమైక్యత  వజ్రోత్సవాల సందర్భంగా  శుక్రవారం రోజున భువనగిరి నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించనున్న సమైక్యతా ర్యాలీ జయప్రదం చేయాలని భూదాన్ పోచంపల్లి ఎంపీపీ మాడుగుల ప్రభాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. భూదాన్ పోచంపల్లి మండలంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంపీపీ మాట్లాడుతూ సమైక్యతా ర్యాలీలో   మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల ఐకెపి సంబంధించిన గ్రామ బుక్ కిపర్స్, అంగన్వాడీ కార్యకర్తలు, ఆశ కార్యకర్తలు, అధికారులు, అనాధికారులు పెద్ద సంఖ్యలో అందరూ పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ బాల శంకర్ వివిధ అధికారులు పాల్గొన్నారు.