- కోలాహలంగా బతుకమ్మ చీరలు మరియు ఆసరా పింఛన్లు పంపిణీ
- ఉద్యమంలా పంచిపెడుతున్న ప్రజా ప్రతినిధుల
- చీరలు చూసుకుని మురిసిపోతున్న ఆడబిడ్డలు
- సీఎం కేసీఆర్ అందించిన కానుక
- అంటూ సంతోషం వ్యక్తం చెస్తున్న వ్రుద్దులు
- స్వయంగా అందజేస్తున్న ఎంపీపీ జడ్పీటీసీ
చిట్యాల సెప్టెంబర్ 27(ప్రజాజ్యోతి).// కేసీఆర్ పుట్టింటి కానుకగా ఆడబిడ్డలకు ఇస్తున్న బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం మరియు ఆసరా పింఛన్లు పంపిణీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆదేశాల మేరకు స్థానిక ఎంపిపి కొలను సునీత-వెంకటేష్ గౌడ్ మరియు జడ్పీటీసీ సుంకరి ధనమ్మ యాదగిరి గౌడ్ ఆధ్వర్యంలో మండలస్థాయిలొ కోలాహలంగా జరుగుతున్నది.ఈ కార్యక్రమంలో సర్పంచులు,ఎంపీటీసీ లు, స్థానిక పజాప్రతినిధులు పాల్గొన్నారు.ఆడపడుచులకు రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ చీరలను కానుకగా అందిస్తున్నామని ఆసరా ఫెంన్షన్లతొ వ్రుద్దుల ఆత్మగౌరవం పెరిగింది అని ఎంపీపీ కొలను సునీత-వెంకటేష్ గౌడ్ పెర్కొన్నరు. మండలంలోని సుంకెనపల్లి, ఎపూరు, పెరెపెల్లి, బొంగొనిచెర్వు, పిట్టంపల్లి, ఆరెగుడెం, పెద్దకాపర్తి పలు గ్రామాల్లో ఆసరా ఫెంన్షన్లు మరియు బతుకమ్మ చీరల పంపిణీ చెయడం జరిగింది.బతుకమ్మ పండుగ సందర్భంగా ఆడపడుచులకు ఎంపిపి శుభాకాంక్షలు తెలిపారు.ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పాలనలొ నియోజకవర్గంలో అందరు సంతోషంగా ఉన్నారు అని కొనియాడారు.
- 4 views