శ్రీ చైతన్య పాఠశాలలో మ్యాథ్స్ క్లబ్ ప్రారంభం

Submitted by Guguloth veeranna on Fri, 18/11/2022 - 21:48
Maths Club started in Sri Chaitanya School

పాల్వంచ, నవంబర్ 18, ప్రజాజ్యోతి : పట్టణ పరిధి కాంట్రాక్టర్స్ కాలనీలోని శ్రీ చైతన్య పాఠశాలలో శుక్రవారం మ్యాథ్స్ క్లబ్ ని ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి బొల్లోరిగూడెం హై స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు రాజమౌళి, అభ్యుదయ పాఠశాల స్కూల్ అసిస్టెంట్ ఏ.హరి ముఖ్యఅతిథిలుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..గణితం యొక్క ఆవశ్యకతను, మెలకువలను విద్యార్థులకు వివరించారు. అనంతరం పాఠశాల ప్రిన్సిపాల్ ఇస్మాయిల్ మాట్లాడుతూ.. పాఠశాలలోని విద్యార్థులకు గణితాన్ని సులభంగా అర్థమయ్యే విధంగా పలు పద్ధతులను అమలు పరచినట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ ఇస్మాయిల్, డీన్ నాగేశ్వరరావు, సి ఇన్చార్జ్, ప్రైమరీ ఇంచార్జ్ నరేష్, వర్తిని, పిపిటి శిరీష, గణిత ఉపాధ్యాయులు, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.