జనక్ ప్రసాద్ అధ్యక్షతన యూనియన్ లో చేరికలు

Submitted by Srikanthgali on Wed, 23/11/2022 - 17:33
జానక్ ప్రసాద్ అధ్యక్షతన యూనియన్ లో చేరికలు

సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ అధ్యక్షతన యూనియన్ లో చేరికలు

కొత్తగూడెం క్రైమ్, నవంబర్ 23, ప్రజాజ్యోతి:

హెచ్ ఏం ఎస్ యూనియన్ నుండి ఐ న్ టి యూ సి యూనియన్లోకి చేరికలు జరుగుతున్నాయి అని కొత్తగూడెం ఏరియా వైస్ ప్రెసిడెంట్ కేడెం ఆల్బర్ట్ అన్నారు. కొత్తగూడెం ఏరియా ఓసీ సి హెచ్ పి, లో విధులు నిర్వహిస్తున్న హెచ్ ఏం ఎస్ యూనియన్ పిట్ సెక్రటరీ రాచెర్ల శ్రీనివాస్ ఆ యూనియన్ కి రాజీనామా చేసి ఐ న్ టి యూ సి సింగరేణి కోల్ మైన్స్ లేబర్ యూనియన్ సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ ఆధ్వర్యంలో యూనియన్ లో కి వచ్చారన్నారు. సింగరేణి పరిరక్షణకై ఐ న్ టి యూ సి చేస్తున్న కార్యక్రమలకు ఆకర్షితుడై కొత్తగూడెం లో నిర్వహించిన కొత్తగూడెం ఏరియా, కార్పొరేట్ ఏరియా జనరల్ బాడీ సమావేశంలో ఐ న్ టి యూ సి కండువా కప్పుకొని యూనియన్ లో చేరారు అన్నారు.