చదువులో విద్యార్థులను ప్రోత్సహించాలి గుగ్గిళ్ళ ప్రకాష్

Submitted by veerareddy on Sun, 25/09/2022 - 12:59
 Guggilla Prakash should encourage students in studies

తెలకపల్లి, సెప్టెంబర్ 24(ప్రజాజ్యోతి): విద్యార్థులను చదువులో తల్లిదండ్రులు ఉపాధ్యాయులు నిరంతరం ప్రోత్సహించాలని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ గుగ్గిళ్ళ ప్రకాష్ అన్నారు తెలకపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హెచ్ఎం బాలస్వామి అధ్యక్షతన శనివారం విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మధ్యాహ్న భోజనం నాణ్యతగా ఉండేందుకు కృషి చేయాలని విద్యార్థులు క్రమశిక్షణతో ఉన్నత శిఖరాలకు చేరుకోవడానికి తల్లిదండ్రులు కూడా శ్రద్ధ వహించాలని విద్యా కమిటీ చైర్మన్ అన్నారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సిపిఎస్ విద్యా కమిటీ చైర్మన్ మల్లేష్ పాల్గొన్నారు.