అడ్డగుడూర్ సెప్టెంబర్ 20 ( ప్రజా జ్యోతి న్యూస్): అడ్డగూడూర్ మండల కేంద్రంలో నవ తెలంగాణ పత్రిక విలేకర్ పరిగెల కనకయ్య తండ్రి నర్సయ్య మరణించడం జరిగింది. మంగళవారం వారి పార్థివదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి, ప్రగాఢ సానుభూతి తెలిపి కుటుంబ సభ్యులను పరామర్శించా రు. ఈ కార్యక్రమంలోఎంపీపీ దర్శనాల అంజయ్య, జడ్పిటీసీ శ్రీరాముల జ్యోతి అయోద్య, సింగిల్ విండో చైర్మన్ పొన్నాల వెంకటేశ్వర్లు, టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు కొమ్మిడి ప్రభాకర్ రెడ్డి, టిఆర్ఎస్ నాయకులు సత్యం గౌడ్ అవినాష్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.