గుండాల సెప్టెంబర్ 15 (ప్రజా జ్యోతి). యాదాద్రి జిల్లా గుండాల మండల పరిధిలోని వెల్మజాల గ్రామంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించి నూతన గ్రామ శాఖను ఏకగ్రీవంగా సీనియర్ నాయకుల ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా మంద రాములు, ప్రధాన కార్యదర్శిగా పన్నీరు నాగరాజు ,సహాయ కార్యదర్శిగా జేరిపోతుల మధు, ఉపాధ్యక్షులుగా జోలం రాజు, తిరుమల నాగిరెడ్డి, కోశాధికారిగా కొండబోయిన ఐలయ్యలను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు ద్వాప కృష్ణారెడ్డి, ఈరసరపు యాదగిరి గౌడ్, పురుగుల మల్లేశం, ఏలూరు రామ్ రెడ్డి, లింగాల బిక్షం, ఎంపీటీసీ కొర్న నరేష్ ,రవికుమార్ వెంకటాద్రి కార్యకర్తలు పాల్గొన్నారు
- 6 views