టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రమావత్ రవీంద్ర కుమార్ నాయక్
నాంపల్లి, సెప్టెంబర్ 29(ప్రజాజ్యోతి ): మండల కేంద్రంలోని నక్క సునంద ఫంక్షన్ హాల్ లో గురువారం రోజు తెరాస పార్టీ ఏర్పాటు చేసినదళిత ఆత్మీయ సమ్మేళనం వనభోజనం కార్యక్రమానికి ముఖ్యఅతిథిలుగానాంపల్లి మండల ఇంచార్జి నల్లగొండ జిల్లా ఎమ్మెల్సీ ఎంసి కోటిరెడ్డి, జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మరియు దేవరకొండ శాసన సభ్యులు రమావత్ రవీందర్ కుమార్ నాయక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ దళితులకు కేసీఆర్ దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టి వారి అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తున్నారని, రాష్ట్ర ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత ఒక కేసీఆర్ దేనని అన్నారు.ఈ కార్యక్రమంలోనాంపల్లి జడ్పీటిసి ఏవి రెడ్డి, వైస్ ఎంపీపీ పానగంటి రజిని వెంకన్న గౌడ్, మండల రైతు బంధు సమితి కన్వీనర్ ఏడుదొడ్ల రవీందర్ రెడ్డి, అదేవిధంగా గ్రామ శాఖ అధ్యక్షుడు నాంపల్లి సత్తయ్య, సింగల్ విండో డైరెక్టర్ బెల్డి సత్తయ్య, ప్రధాన కార్యదర్శి గాదేపాక రమేష్, త్రివేణి సంగమ సొసైటీ అధ్యక్షుడు ఈద శేఖర్ టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఇట్టం వెంకట్ రెడ్డి ఎదుల్ల రాములు, కర్నె యాదయ్య కార్యకర్తలు కోరే జై రాములు,గాదేపాక శ్రీకాంత్,గాదేపాక మధు,ఎదుళ్ల అశోక్, గాదెపాక నాగరాజు,కోరే మహేష్, గాదెపాక వెంకట్ మరియు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
- 4 views