- సంస్థాన్ లో రేవంత్ రెడ్డికి స్వాగతం
సంస్థాన్ నారాయణపురం సెప్టెంబర్ 3 ( ప్రజా జ్యోతి) టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హైదరాబాదు నుండి మునుగోడు కు వెళుతుండగా సంస్థాన్ నారాయణ పురం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. మన మునుగోడు మన కాంగ్రెస్ అనే కార్యక్రమంలో పాల్గొనడానికి శనివారం నాడు రేవంత్ రెడ్డి , ఉత్తమ్ కుమార్ రెడ్డి వెళ్లారు. ఈ సందర్భంగా వారికి ఉప ఎన్నిక మండల ఇన్చార్జిలు సత్యనారాయణ, బలరాం నాయకులు శాలువా కప్పి స్వాగతం పలికారు . అలాగే మండల స్థాయి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
- 1 view