పాల్వంచ, నవంబర్ 14, ప్రజాజ్యోతి : పాల్వంచ పట్టణ పరిధి కాంట్రాక్టర్స్ కాలనీలోని శ్రీ చైతన్య పాఠశాలలో సోమవారం బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులకు క్రీడా పోటీలు నిర్వహించి పోటీలలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన వారికి ప్రిన్సిపల్ ఇస్మాయిల్ బహుమతులు అందజేశారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ.. నేటి బాలలే రేపటి పౌరులని, చక్కగా చదువుకొని మంచి భవిష్యత్తు సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ ఇస్మాయిల్, డీన్ నాగేశ్వరరావు, సి ఇంచార్జ్ నరేష్, ప్రైమరీ ఇంచార్జ్ వర్తిని, పిపిటి ఇంచార్జ్ శిరీష, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు.
- 7 views