బాలల హక్కులు సక్రమంగా అమలు చేయాలి

Submitted by Srikanthgali on Mon, 21/11/2022 - 17:36
బాలల హక్కులు సక్రమంగా అమలు చేయాలి

బాలల హక్కులు సక్రమంగా అమలు చేయాలి

కొత్తగూడెం క్రైమ్, నవంబర్ 21, ప్రజాజ్యోతి:
అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవం పురస్కరించుకొని స్థానిక కొత్తగూడెం నియోజకవర్గ పరిధిలోని గాజులరాజం బస్తీ24వ వార్డులో బాలల హక్కుల ప్రజాధ్వని రాష్ట్ర అధ్యక్షురాలు కెడెం కృష్ణావేణి ఆధ్వర్యంలో బాలల హక్కుల దినోత్సవవేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా కృపావేణి మాట్లాడుతూ 1989 నవంబర్ 20వ తేదీన వివిధ దేశాల ప్రభుత్వాల కృషి ఫలితంగా బాలల హక్కుల తీర్మానం ఐక్యరాజ్యసమితి ఆమోదించిందని గుర్తు చేశారు. బాలల హక్కుల చట్టాలు ఉన్నప్పటికీ బాలలపై అత్యాచారాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకా చట్టాలను పకడ్బందీగా సక్రమంగా అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆమె అన్నారు. ఈ కార్యక్రమం లో నక్క సృజన, పిల్లలు పాల్గొన్నారు.