ఆనందంతో కోలాట నృత్యం చేస్తున్న అధికారులు
పాల్గొన్న పలు శాఖల ఉన్నతాధికారులు
బోనకల్ , అక్టోబర్ 03, ప్రజాజ్యోతి:
స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఎంపిడిఓ,ఎంపీపీ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబురాలు అంబరాన్నంటాయి.బతుకమ్మ శోభ ఉట్టిపడింది.రంగు రంగుల పూలను ఒద్దికగా పేర్చ రాగయుక్తమైన పాటలకు లయబద్దమైన తాళం వేస్తూ మహిళ అధికారులు ఆడిపాడారు.పూల సింగిడి నేలకు దిగిందా అన్నట్టుగా బతుకమ్మలతో మురిసిపోయాయి.మండల పరిషత్ కార్యాలయం ఊరూవాడా ఉయ్యాల పాటలు మారుమోగాయి.తీరొక్క పూలతో తీరుగా పేర్చిన బతుకమ్మలన్ని నేలతల్లిని సింగారించాయా అన్నట్టు.. మైమరిపించాయి. ఎంపీపీ కంకణాల సౌభాగ్యం,ఎంపీడీవో బోడెపూడి వేణుమాధవ్, ఎస్సై తేజావత్ కవిత ఎంపీఓ వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి, వైస్ ఎంపీపీ గుగులోత్ రమేశ్,కో ఆప్షన్ సభ్యులు షేక్ జమాలుద్దిన్,ఆర్ఐ గూగులోత్ లక్ష్మణ్,ఏపీఓ బసవోజు కృష్ణకుమారి,ఎపీఎం యద్దనపుడి పద్మాలత,ఏసీడిపీఓ కమలప్రియ,వివిధ గ్రామ పంచాయితీల కార్యదర్శులు,అంగన్వాడి టీచర్లు,పలు ప్రభుత్వ శాఖల అధికారులు సిబ్బంది ఆట పాటలతో కోలాటాలు ఆడుతూ ఉత్సాహపరిచారు.
- 20 views