తెలకపల్లి, సెప్టెంబర్ 4 (ప్రజాజ్యోతి ):భార్య పుట్టింటికి వెళ్లిందని మనస్థాపానికి గురై సెల్ టవర్ పైకి ఎక్కి నిరసన తెలిపిన సంఘటన తెలకపల్లి మండలంలోని గట్టు రాయిపాకుల గ్రామంలో ఆదివారం జరిగింది ఎస్సై ప్రదీప్ కుమార్ గ్రామస్తులు తెలిపిన కథనం మేరకు గ్రామానికి చెందిన సుంకర లింగస్వామి భార్య జానకమ్మ మధ్య గొడవ జరిగింది కొన్ని రోజుల క్రితం పుట్టినిల్లు అయిన గన్యాగుల గ్రామానికి వెళ్ళిపోయింది తర్వాత తన భర్త పై నాగర్ కర్నూల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది
ఈ క్రమంలో పోలీసులు లింగస్వామిని స్టేషన్కు పిలిపించడంతో మనస్థాపానికి గురైన భర్త లింగస్వామి సెల్ టవర్ ఎక్కి కొన్ని గంటలు నిరసన వ్యక్తం చేశాడు సెల్ టవర్ పై నుండి దిగి రాకపోవడంతో భార్య జానకమ్మను గన్యాకుల నుండి రాయిపాకులకు పోలీసులు రప్పించారు భార్య రాకతో లింగస్వామి శాంతించి టవర్ దిగాడు పోలీసులు వారిని కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు.
- 1 view