అర్హులందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలి

Submitted by Upender Bukka on Tue, 20/09/2022 - 10:57
Houses should be given to all the deserving ones

నడిగూడెం, సెప్టెంబర్ 19, ప్రజా జ్యోతి: మండల కేంద్రం లోని తాసిల్దార్ కార్యాలయం వద్ద ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో  సోమవారం  ధర్నా నిర్యహించారు.   ఈ సందర్భంగా ప్రజాసంఘాల ఐక్యవేదిక కన్వీనర్, జిల్లా రైతు సంఘం సహాయ కార్యదర్శి బెల్లంకొండ సత్యనారాయణ మాట్లాడుతూ అర్హులందరికీ ఇల్లు, ఇంటి స్థలాలు ఇవ్వాలని కోరారు.మండలంలోని అన్ని గ్రామాలలో ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ప్రజల సమస్యల మీద సర్వే చేసి  సమస్యలు గుర్తించినట్లు తెలిపారు. ప్రజలకు డబల్ బెడ్ రూమ్ ఇండ్లు,ఇంటి స్థలలాలు,రేషన్ కార్డులు ,వృద్ధాప్య, వికలాంగులు, ఒంటరిమహిళ,వితంతుపింఛన్లు ,దళిత బంధు ,దళితలందరికి ఇవ్వాలని పేర్కొన్నారు.పదకాలకు అర్హులైన  నిరుపేదలు చాలా మంది ఉన్నట్లు  గుర్తించి నట్లు తెలిపారు. అర్హులైన వారందరికీ  పథకాలుఅందేవిధంగా  రాష్ట్ర  ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో వీరమ్మ, వెంకటమ్మ, శ్రీను, ఉపేందర్, వీరభద్రం, సామేలు,వెంకన్న, మోహన్ రావు, వెంకటేశ్వర్లు, బాలయ్య, సాలయ్య,తదితరులు పాల్గొన్నారు.