అర్హులందరికీ ఇల్లు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి...

Submitted by shaikmohammadrafi on Tue, 20/09/2022 - 10:51
Houses should be given to all the deserving...

బెల్లంకొండ సత్యనారాయణ..

 రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి..

నడిగూడెం, సెప్టెంబర్ 19, ప్రజా జ్యోతి:  మండల కేంద్రం లోని తాసిల్దార్ కార్యాలయం వద్ద ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో  సోమవారం  ధర్నా నిర్యహించి అనంతరం   డిప్యూటీ తహసీల్దార్ జవహర్ కు సమస్యలతో కూడిన వినతి  పత్రం  అందజేసి  ఈ సందర్భంగా ప్రజాసంఘాల ఐక్యవేదిక కన్వీనర్, జిల్లా రైతు సంఘం సహాయ కార్యదర్శి బెల్లంకొండ సత్యనారాయణ మాట్లాడుతూ అర్హులందరికీ ఇల్లు ఇంటి స్థలాలు ఇవ్వాలి అన్నారు.మండలంలోని అన్ని గ్రామాలలో ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ప్రజల సమస్యల మీద సర్వే చేసి  సమస్యలు గుర్తించినట్లు తెలిపారు. ప్రజలు డబల్ బెడ్ రూమ్ ఇండ్లు కావాలని,ఇంటి స్థలలాలు,రేషన్ కార్డ్ లు,వృద్ధాప్య, వికలాంగులు, ఒంటరి మహిళ, వితంతు పింఛన్లు కావాలని దళిత బంధు దళితలందరికి ఇవ్వాలని అనేకపదకాలకు అర్హులైన  నిరుపేదలు చాలా మంది ఉన్నట్లు  గుర్తించి నట్లు తెలిపారు. అర్హులైన వారందరికీ పై పథకాలుఅందెవిధముగా రాష్ట్ర  ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో వీరమ్మ, వెంకటమ్మ, శ్రీను, ఉపేందర్, వీరభద్రం, సామేలు,వెంకన్న, మోహన్ రావు, వెంకటేశ్వర్లు, బాలయ్య, సాలయ్య,తదితరులు పాల్గొన్నారు.