జిల్లాలోని పోషకాహార లోపం లేని మండలం గా గట్టు గుర్తింపు

Submitted by bheemaraidu on Fri, 30/09/2022 - 12:37
 Guttu is recognized as a malnutrition-free zone in the district


గద్వాల ప్రతినిధి (ప్రజా జ్యోతి) సెప్టెంబర్ 29 :  జోగులాంబ గద్వాల జిల్లా నియోజకవర్గంలోని మహిళలు, మరియు పిల్లల లో పోషకాహార లోపం, రక్తహీనత, బాల కార్మికులు, బాల్య వివాహాలపై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో గట్టు మండలం పోషకాహార లోపం లేని మండలం గా కృషి చేసినందుకుగాను, జిల్లాలోని పోషకాహార లోపం లేని మండలం గా గుర్తింపు పొందినందుకు, గట్టు ఎంపీపీ విజయ్ కుమార్ నీ సన్మానించిన, అభినందించిన గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి, అడిషనల్ కలెక్టర్ కోయ శ్రీహర్ష, డి ఎం హెచ్ ఓ చందు నాయక్, జడ్పీ వైస్ చైర్మన్ సరోజమ్మ. ఈ కార్యక్రమంలో జడ్పిటిసిలు బాస్ శ్యామల, రాజశేఖర్, పద్మమ్మ, ఎంపీపీ మనోహర్, సీఈవో విజయ నాయక్ తదితరులు పాల్గొన్నారు.