ఎమ్మెల్యే ను పరామర్శించిన ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్

Submitted by Degala shankar on Thu, 22/09/2022 - 16:48
Government Whip Gampa Govardhan visited the MLA

ఆదిలాబాద్ బ్యూరో సెప్టెంబర్ 22, (ప్రజా జ్యోతి),,,..  ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న ను ప్రభుత్వ విప్, కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ పరామర్శించారు. ఇటీవల ఎమ్మెల్యే జోగు రామన్న మాతృమూర్తి జోగు భోజమ్మ మృతి చెందడంతో విషయం తెలుసుకున్న గంప గోవర్ధన్ గురువారం ఎమ్మెల్యే స్వగ్రామమైన జైనథ్ మండలం దీపాయి గూడ గ్రామానికి వచ్చి భోజమ్మ చిత్రపటం వద్ద పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే రామన్న తో మాట్లాడి తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఆయన తో పాటు  ఆదిలాబాద్ జిల్లా పరిషత్ చెర్మన్ రాథోడ్ జనార్దన్, మాజీ పార్లమెంట్ సభ్యులు గేడం నగేష్, పలువురు ప్రజాప్రతినిధులు, తెరాస పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, పురాప్రముఖులు, కుటుంబ సభ్యులు, అన్ని వర్గాల సంఘాల ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.