నవరాత్రులు భక్తి పరవశంతో గణేషుని పూజలు చేయాలి

Submitted by Sathish Kammampati on Thu, 08/09/2022 - 14:15
Ganesh should be worshiped with great devotion during Navratras

నేనావత్  కిషన్ నాయక్

దేవరకొండ సెప్టెంబర్ 07,(ప్రజాజ్యోతి) బుధవారం దేవరకొండ నియోజకవర్గం చింతపల్లి మండలం పోలెపల్లి,మదనపురం, గ్రామపంచాయితిలలో పలు గణేష్  మండపాలను ఉకొండి గిరి, ఆధ్వర్యంలో సందర్శించిన మన జన హృదయ నేత బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి పేదల పెన్నిధి దేవరకొండ నియోజకవర్గ ముద్దుబిడ్డ అఖిలభారత ఆదివాసీల కాంగ్రెస్ కో-ఆర్డినేటర్ నేనావత్ కిషన్ నాయక్ వారితోపాటు  నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు నగేష్ సేటు,యండి ఇమ్రాన్ ఉన్నారు.ఈ సందర్భంగా అక్కడి యువకులు డప్పువాద్యాలతో  ఘనస్వాగతం పలుకుతు శాలువాలతో సన్మానించడం జరిగింది.తదనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో  నియోజకవర్గ యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి లింగం గౌడ్,యువజన కాంగ్రెస్ నాయకులు వజ్జశ్రీనివాస్ రెడ్డి, జైపాల్ నాయక్, నరేందర్ నాయక్,అంకూరి మల్లేష్, రాజా నాయక్,అల్వాల మనోహర్ గౌడ్,కిషన్ నాయక్ వీరాభిమాని గంగాల శంకర్ యాదవ్, శ్రీకాంత్ గౌడ్,కానమోని మహేష్ ముదిరాజ్, శంకరచారీ,తుప్పరి కిరణ్,సాయి,శివ, గ్రామయువకులు మహిళలు,ప్రజలు తదితరులు పాల్గొన్నారు.