గుర్రంపోడ్:అక్టోబర్ 02(ప్రజా జ్యోతి)./..జాతిపిత మహాత్మా గాంధీ 153 వ జయంతి వేడుకలను ఆదివారం గుర్రంపోడు మండల కేంద్రంలోని రహదారి బంగ్లాలో స్థానిక సర్పంచ్ మస్రత్ జహ సయ్యద్ మియా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా సర్పంచ్ మస్రత్ జహ సయ్యద్ మియా మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి శాంతి,అహింసా పద్ధతులలో భారతదేశానికి స్వాతంత్ర్యం సాధించి పెట్టిన గాంధీ సేవలను కొనియాడారు.ఈ కార్యక్రమంలో గుర్రంపోడు గ్రామపంచాయతీ కోఆప్షన్ మెంబర్లు బుర్రి ఇంద్రారెడ్డి, వనమాల చక్రపాణి,స్థానిక నాయకులు షేక్ జాకీర్,జాల యాదయ్య యాదవ్,రావుల కళ్యాణ్ గౌడ్, బొడ్డుపల్లి జగదీష్,మురళాచారి, వార్డు సభ్యులు,గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
- 6 views