యుద్ధం చేసే సత్తా ఉన్న వారికి కత్తి చేతికి ఇవ్వాలి మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి

Submitted by mallesh on Tue, 27/09/2022 - 15:18
Former MLA Koosukuntla Prabhakar Reddy should give sword to those who have the ability to fight

చౌటుప్పల్ సెప్టెంబర్ 26( ప్రజా జ్యోతి)//....మునుగోడు అభివృద్ధి కోసం రాజీనామా చేసి ప్రతిపక్షం బిజెపి పార్టీలో చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నిధులు ఎక్కడినుండి తెచ్చి అభివృద్ధి ఎట్లా చేస్తారని మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అన్నారు. సోమవారం దేవలమ్మ నాగారం గ్రామంలో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పర్యటించారు, కాంగ్రెస్ పార్టీకి చెందిన మైనార్టీ నాయకులను టిఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించారు, మైనార్టీ, రెడ్డి, కమ్యూనిటీ భవనాలకు శంకుస్థాపన చేశారు. ప్రమాదవశాత్తురోడ్డు ప్రమాదంలో రెండు కాళ్లు కోల్పోయిన గుడ్డేటి జంగయ్య కుటుంబీకులకు వైద్య ఖర్చుల నిమిత్తం 50,000 ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత మూడున్నర సంవత్సరాలుగా మునుగోడు ఎమ్మెల్యేగా కొనసాగిన రాజగోపాల్ రెడ్డి , మునుగోడు ప్రజల అభివృద్ధి కోసం పట్టించుకోకుండా కాంట్రాక్టుల పై దృష్టి పెట్టి వేల కోట్ల రూపాయల కూడబెట్టారన్నారు. అభివృద్ధి కోసం ఏనాడు మంత్రిని కలవకుండా, బిజెపి మతతత్వ పార్టీలో చేరి మునుగోడు నియోజకవర్గంలో మత విద్వేషాలను రగిలిస్తున్నారని విమర్శించారు. 


స్థానిక సమస్యలపై అవగాహన లేని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దేవలమ్మ నాగారం ప్రజలను ఏం ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతారని ఎద్దేవా చేశారు. యుద్ధం చేసే సత్య ఉన్నవారికి కత్తి చేతికి ఇచ్చి యుద్దభూమికి పంపాలని ప్రజలకు సూచించారు. బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసమే సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు నిరంజన్ గౌడ్, అభినందన్ రెడ్డి, బాబా షరీఫ్, సురకంటి శ్రీనివాస్ రెడ్డి,  లక్ష్మణ్, పాక రాము, తూర్పునూరు బాల్ రాజు గౌడ్, తదితరులు పాల్గొన్నారు.