గద్వాల ప్రతినిది (ప్రజాజ్యోతి) సెప్టెంబర్ 05 : సోమవారం గద్వాల నియోజకవర్గం మల్దకల్ మండలం పరిధిలోని పెద్ద దొడ్డి గ్రామానికి చెందిన నరసింహులు గౌడ్ అనారోగ్యంతో మరణించారు. వారి కుటుంబ సభ్యులకు భార్య శశిరేఖ కీ ప్రభుత్వం తరుపున ఆర్థిక సాయం గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి చేతుల మీదుగా రైతు బీమా ద్వారా రూ.5 లక్షలు రూపాయలు చెక్కును అందజేశారు.
ఆపద స్థితిలో ఉన్న మమ్మల్ని ఆదుకున్నందుకు తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి కి, ఎమ్మెల్యేకి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ వీరన్న, మండలం రైతు బంధు సమితి అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి, ఎంపిటిసి రాజు, తెరాస పార్టీ నాయకులు రాముడు తదితరులు పాల్గొన్నారు
- 4 views