నాంపల్లి, సెప్టెంబర్ 22(ప్రజాజ్యోతి)..//.. నాంపల్లి మండలం కేతపల్లి గ్రామంలో బుధవారం రోజున ఎమ్మార్పీఎస్ నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఎమ్మార్పీఎస్ మండల కన్వీనర్ బుషిపాక శాంతి కుమార్ మాదిగ హాజరైనారు. అనంతరం వారి ఆధ్వర్యంలో ఎమ్మార్పీఎస్ నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ఎమ్మార్పీస్ గ్రామ అధ్యక్షులుగా పల్లేటి సైదులు ప్రధాన కార్యదర్శిగా పల్లేటి ఆంజనేయులు, సహాయ కార్యదర్శిగా పుల్లేటి కాశయ్య సహాయ కార్యదర్శిగా పల్లేటి మహేష్ కోశాధికారిగా పల్లెటి ప్రవీణ్ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మండల నాయకులు ప్రకాష్ ఊరిపక్క వెంకటయ్య, పల్లెటి అంజి, పల్లెటి శివ, బుసిపాక యాదయ్య బుసిపాక ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.
- 6 views