ఘనంగా ప్రారంభమైన దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు

Submitted by bheemaraidu on Tue, 27/09/2022 - 12:54
Dussehra Sharannavaratri celebrations have started grandly

గద్వాల ప్రతినిధి ప్రజా జ్యోతి సెప్టెంబర్ 26 :  జోగులాంబ గద్వాల జిల్లా మల్లకల్ మండల కేంద్రంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి దేవస్థానంలో మొదటి రోజు ఆశ్వీజ శుద్ధ పాడ్యమి సోమవారం రోజున బాల త్రిపుర సుందరి దేవి అలంకారం లో దర్శనమిచ్చారు "పత్రి  పురాత్రయంలో శ్రీ బాల త్రిపుర సుందరీ దేవి ప్రథమ స్థానంలో ఉంది" ఆమె ఎంతో మహిమాన్వితమైనది సమస్త దేవి మంత్రాలలోకెల్లా శ్రీ బాలా మంత్రం గొప్పది కావున బాల త్రిపుర సుందరీ దేవి అలంకారంలోనూ అమ్మవారిని దర్శించుకోవడం మహాభాగ్యమని పురోహితులు చెప్పారు ఆలయంలో ఉదయం అభిషేకం కుంకుమార్చన మొదలు కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు ఈ కార్యక్రమంలో మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు ఇల్లూరు నాగరాజు పట్టణ అధ్యక్షులు బాదం శ్రీనివాసులు మానసాని నాగరాజు నరహరి వెంకటేష్ నరహరి ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.