దళిత బాంధవుడు సి.యం కేసీఆర్. ఎంపీపీ యాతాకుల జ్యోతి మధుబాబు.

Submitted by Upender Bukka on Mon, 19/09/2022 - 11:48
A Dalit member CM KCR.MPP Yatakula Jyoti Madhubabu.

నడిగూడెం, సెప్టెంబర్ 18, ప్రజా జ్యోతి:   దళిత  బాంధవుడు సీఎం కేసీఆర్ అని ఎంపీపీ యాతాకుల  జ్యోతి మధుబాబు  అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో  డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు  వేసి నివాళులు అర్పించారు. అనంతరం  సి.యం, మంత్రి, ఎం.యల్.ఏ ల చిత్ర  పటాలకు పాలాభిషేకం చేసారు. ఈ సందర్బంగా  ఆమె మాట్లాడుతూ సెక్రటేరియట్ కు గౌరవనీయులు డాక్టర్ బి.ఆర్  అంబేద్కర్  పేరు నామకరణం చేయటం,
యస్.టి లకు 10 శాతం రిజర్వేషన్, గిరిజన బంధు, ప్రకటించినసి.యం దళిత  బాంధవుడుగా ఎప్పటికి చరిత్రలో  నిలిసి పోతారని  చెప్పారు.
కోదాడ శాసన సభ్యులు బొల్లం మల్లయ్య ఆదేశాను సారంమండల ఎస్సీ ఎస్టీ, సెల్ ఆధ్వర్యంలోదేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ గిరిజన జాతి కోసం 75 సంవత్సరాల తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవం సందర్భంగా గిరిజన బిడ్డలను ప్రత్యేకంగా గుర్తించి హైదరాబాదులోని బంజారాహిల్స్ నందు శ్రీ సంత్ సేవాలాల్ బంజారా భవనంనుప్రారంభించినారు. బంజారా లకు ప్రత్యేకంగా 500జనాభాకుగ్రామపంచాయతీలనుఏర్పాటుచేసిఆనాడుగిరిజనులహృదయాలను గెలుచుకుని మరోసారి గిరిజనులకు 10శాతం రిజర్వేషన్,గిరిజన బంధు ప్రకటించిన సందర్భంగా యావత్తు తెలంగాణలో గిరిజన జాతి రుణపడి ఉంటుంది అని గిరిజన నాయకులు వ్యాఖ్యానించారు. గిరిజన నాయకులు పాలాభిషేకం చేసి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపినారు.ఈ కార్యక్రమంలో జడ్పిటిసి  బాణాల కవిత నాగరాజు, మండల పార్టీ అధ్యక్షులు పల్ల  నర్సిరెడ్డి,మాజీ సర్పంచ్ అలంతులు ఆంజనేయులు, ఎస్టి సెల్ అధ్యక్షుడు లావుడియ ప్రతాప్, బాణాల సతీష్, వెంకటేశ్వర్లు,కోటి, అర్జున్, వీరేష్, వెంకట్ రెడ్డి, రామ్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు....