పంది దాడిలో గాయపడిన చిన్నారి

Submitted by sridhar on Wed, 07/09/2022 - 10:20
A child injured in a pig attack
  • త్రుటిలో తప్పిన ప్రాణగండం 

గద్వాల్: ప్రజా జ్యోతి ప్రతినిధి:- ఐజ పట్టణ మున్సిపాలిటీ పరిధిలోని ఎస్సీ కాలని 16 వ వార్డు నందు పందుల స్వైర విహారం తో ఇంటిముందు ఆడుకుంటున్న రెండేళ్ల నిత్య అనే చిన్నారి (తుంకుంట నాగమ్మ మనవరాలు )ఒక పెద్ద పంది చిన్నారిని నోటితో పట్టుకొని  ముళ్ళకంప లోకి  ఈడ్చుకుపోతుండగా కొందరు అక్కడే ఉన్న కాలనీవాసులు వెంటనే పాపను పంది బారినుండి రక్షించారు.

ఈ సంఘటనను చూసిన కాలనీవాసులు పందుల బారి   నుండి చిన్నారులను ఎలా కాపాడుకోవాలో భయాందోళనకు గురవుతున్నారు  ఇట్టి విషయంపై మునిసిపాలిటీ కమిషనర్ మరియు సంబంధిత అధికారులు వెంటనే స్పందించి పందుల స్వైర విహారాన్ని అరికట్టి చిన్నారుల ప్రాణాలను, ప్రజల ఆరోగ్యాలను కాపాడాలని కాలనీవాసులు  కోరుతున్నారు.