రాజ్యాంగ స్ఫూర్తిని కేంద్ర ప్రభుత్వం కాలరాస్తుందా..??

Submitted by Praneeth Kumar on Mon, 12/09/2022 - 20:23
Is central government writing down the spirit of the constitution..??

రాజ్యాంగ స్ఫూర్తిని కేంద్ర ప్రభుత్వం కాలరాస్తోందా..??

అసెంబ్లీ లో జరిగిన  చర్చ చూస్తే అవుననే చెప్పాలేమో..!!

ఖమ్మం అర్బన్, సెప్టెంబర్ 12, ప్రజాజ్యోతి.

అంబేద్కర్‌ తీసుకొవచ్చిన రాజ్యాంగ స్ఫూర్తిని కేంద్ర ప్రభుత్వం రోజు కింత కాలరాస్తుందా అంటే అవుననే చెప్పాలేమో. రాష్ట్ర అసెంబ్లీలో సోమవారం విద్యుత్‌ సంస్కరణలపై లఘు చర్చ జరిగింది. ఈ సందర్భంగా బిజెపి ఎమ్మెల్యే రఘునందన్‌ రావు బిజెపి తీసుకువచ్చిన విద్యుత్‌ సంస్కరణల్లో ఎక్కడా వ్యవసాయానికి ఉచిత కరెంటు ఇవ్వొద్దని చెప్పలేదని పేర్కొన్నారు. దీని పై రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. రఘునందన్‌ రావు సభను తప్పదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు, ఈ సందర్భంగా కేంద్ర విధానాలను రాష్ట్ర ప్రభుత్వం తూర్పారబట్టింది. ‘ఆధునిక ప్రపంచంలో యావత్‌ ప్రపంచం కూడా ఆయా దేశాలు, నాగరిక ప్రపంచం ఆవిష్కరించే అభివృద్ధి అనేక కొలమానాల ద్వారా చూస్తారు. అందులో ప్రధానసూచిన పర్‌ క్యాపిటా, పవర్‌ యూటిలైజేషన్‌. ఏ దేశం, ఏ రాష్ట్రంలో ఎంత పవర్‌ యూజ్‌ చేస్తున్నరు..?? అది చాలా ముఖ్యమైన సూచికల్లో భాగంగా ఆధునిక ప్రపంచ పరిగణిస్తుంది. ఇక్కడ ఇష్యూ ఏంటంటే తెలంగాణ రాష్ట్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న సమయంలో కరెంటు, దాని సరఫరా, ప్రజల పడ్డ బాధలు, దాన్ని వినియోగించే సమయంలో జరిగిన మరణాలకు మన అందరం ప్రత్యక్ష సాక్షులం. తెలంగాణ ఏర్పాటుకు ముందు ఆ నాడు అనేక ప్రాంతాల్లో కరెంటు షాక్‌లు కొట్టి చనిపోవడం. బిల్లు కట్టలేదని ఎలక్ట్రిసిటి, విజిలెన్స్‌ అధికారులు విషం తాగి చనిపోవడం. భిక్షపతి అనే వ్యక్తి జమ్మికుంటలో చనిపోవడం, అక్కడికి మనమందరం ఉద్యమ సమయంలో వెళ్లాం. వెరసి కష్టాలను ఇప్పుడు తలచుకుంటేనే భయమవుతుంది’ అని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. అనేక అంశాల్లో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అన్యాయం చేసింది
‘కష్టపడి అందరం కలిసి పోరాటం చేసి తెలంగాణ తెచ్చుకున్నం. తెచ్చుకున్న తర్వాత భయంకరమైన అన్యాయం చేసింది. పునర్వీభజన చట్టంలో ఉన్న అనేక అంశాల్లో ఘోరాతి ఘోరంగా కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేసింది. మొదటి కేబినెట్‌లో కేంద్రం తెలంగాణ గొంతు నులిమేసే విధంగా అందులో మరీ ముఖ్యంగా 460 మెగావాట్ల హైడ్రో ఎలక్ట్రికల్‌ ప్రాజెక్టు, సీలేరును ఆంధ్రాకు కేటాయించింది. సోనియా గాంధీ రాష్ట్ర విభజన సమయంలో బిల్లు తుది దశకు వచ్చే సమయంలో తెలంగాణ పవర్‌ షాటేజ్‌ ఉంటది, పవర్‌ యుటిలేజేషన్‌ ఉంటది. తెలంగాణ మొత్తం భూగర్భ జలాలపైనే ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చింది. సమైక్య రాష్ట్రంలో మానకు వస్తాయన్న ప్రాజెక్టులు రాలేదు కాబట్టి, ప్రజలంతా గతిలేక బోరు వేసుకునే పరిస్థితిలో ఉన్నరు. తెలంగాణలో ఉన్న బోర్లు దేశంలో ఎక్కడా లేవు. కరెంటు కేటాయింపులో అధికంగా కేటాయించాలని కోరితే 53 శాతం తెలంగాణకు కేటాయించారు. దాని దృష్ట్యా సీలేరు పవర్‌ ప్రాజెక్టును తెలంగాణకు కేటాయించారు. భవిష్యత్‌ లో దీని పరిస్థితి ఇట్లే ఉంటదని చెప్పి ఇతరులు పేచీపెట్టినప్పటికి, మన్మోహన్‌ సింగ్‌ నాయకత్వంలో ఆ రోజు బిల్లులో సింగరేణి కాలరీస్‌ మొదటి నుంచి తెలంగాణదే దాని పై హక్కు తెలంగాణకే అని కేటాయించారు’ అంది.

◆ అధికారం అనేది బాధ్యత, ఇది రాచరికం కాదు. ‘దురదృష్టం ఏంటంటే ప్రధానమంత్రి మోది మొదటి మీటింగ్‌లో ఆంధ్రాప్రదేశ్‌ ముఖ్యమంత్రి చేతులో కీలుబొమ్మగా మారిపోయి ఆర్డినెన్స్‌ తెచ్చారు, వాస్తవానికి ఆర్డినెన్స్‌ తేవాల్సిన పరిస్థితి కాదు. శాసనసభలు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా రెఫర్‌ చేయకుండా కర్కషంగా ఏడు మండలాలు, సీలేరు పవర్‌ ప్రాజెక్టు తెలంగాణ నుంచి వేరు చేశారు. ఈ దేశంలో ఫస్ట్‌ పర్సన్ క్రిటిసైజ్‌ మిస్టర్‌ నరేంద్ర మోది, అప్పుడు తెలంగాణ రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చింది. ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం పై విమర్శలు చేశారు. ఈ దశలో అధికారికంగా ఉండి రాష్ట్ర బంద్‌కు పిలుపునిస్తరా..?? అంటే ఇస్తడి, తప్పదు ప్రజాస్వామ్యంలో నిరసన తెలుపాలంది. అప్పుడు తెలంగాణ సమాజం నిరసన తెలిపింది, అనేక పర్యాయాలు చెప్పారు. మండలాల సంగతి వదిలేసినా ప్రాజెక్టునైనా ఇవ్వాలని ప్రధానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖలు రాసింది, ఆయన పరిగణలోకి తీసుకోలేదు. రఘునందన్‌రావు సత్యదూరమైన విషయాలు చెప్పారు, సభను పక్కదోవ పట్టించారు. వందశాతం తప్పు, అంబేద్కర్‌ ఉండే ఎంత కొట్లాడునో ఇప్పుడు ఆయన లేరు మన దురదృష్టం. ఆయన రాజ్యాంగ స్ఫూర్తిని కేంద్ర ప్రభుత్వం రోజుకింత కాలరాస్తుంది. అధికారం అనేది బాధ్యత, ఇది రాచరికం కాదు. బాధ్యతలు అధికారపూర్వకంగా ఉండాలి, రాజ్యాంగం కేంద్రం పరిధిలో, రాష్ట్రాల పరిధిలో ఉండాలి. ఇద్దరు కలిసి సంప్రదించుకొని చేసుకునేందుకు కొన్ని ఉమ్మడి జాబితాలో పెట్టారు, ఈ పవర్‌ ఉమ్మడి జాబితాలో ఉన్నది దీని పై కేంద్రం పెత్తనం లేదు. దురదృష్టవశాత్తు రాష్ట్రాలతో కనీస సంప్రదింపులు చేయకుండా, అడగకుండా, మాటమాత్రం చెప్పకుండా వాళ్ల ఇష్టం  వచ్చిన పద్ధతిలో పార్లమెంట్‌లో మాట్లాడనీయకుండా మూకదాడులు చేస్తున్నారు. ప్రతిపక్ష సభ్యుడు లేస్తే వంద మంది అధికార పార్టీ సభ్యులు లేచి రకరకాల పేర్లు పెట్టి అరవడం. వారి నోళ్లను మూయించడం, గందరగోళం సృష్టించి ఆ బిల్లులను పాస్‌ చేసుకుంటూ ఇలాంటి చట్టాలు చేస్తున్నరు. సమగ్రంగా పార్లమెంట్‌లో చర్చిస్తే అనేక పార్టీలు చర్చిస్తయ్‌, గతంలో బాల్క సుమన్‌ లోక్‌సభ సభ్యుడిగా ఉన్నప్పుడు పార్లమెంట్‌ను ఐదు రోజులు స్తంభింప చేసారు, అయినా కూడా దానికి జవాబు లేదు దాని పై చర్చ లేదు. కనీసం ఎదుటివారు చెబితే వినే సంస్కారం లేదు. బూల్డోజ్‌ చేసి, మా ఇష్టం అనే పద్ధతిలో ఈ దేశాన్ని నడిపే దుర్మార్గమైన పద్ధతి జరుగుతుంది’ అంటూ రాష్ట్ర ప్రభుత్వం మండిపడింది.