గద్వాల ప్రతినిధి (ప్రజాజ్యోతి) సెప్టెంబర్ 27 : జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్, రాజీవ్ చౌక్ నందు కొండా లక్ష్మణ్ బాపూజీ 107వ, జయంతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షులు పులిపాటి వెంకటేష్ మాట్లాడుతూ, కొండా లక్ష్మణ్ బాపూజీ జీవిత చరిత్రను గురించి తెలంగాణ ఉద్యమంలో కొండా లక్ష్మణ్ బాపూజీ గారి పాత్ర, ఈ ఉద్యమ బిడ్డ మన పద్మశాలి కావడం మనకెంతో గర్వకారణం అని ఆయన అన్నారు. త్వరలో పట్టణ నడిబొడ్డున కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహ ఆవిష్కరణ జరుగుతుంది. అని అన్నారు. అదేవిధంగా జిల్లా కలెక్టర్ జిల్లా ఆర్ అండ్ బి అధికారి, జిల్లా ఎస్పీ, లను కలిసి కొండ లక్ష్మణ్ బాపూజీ గారి విగ్రహ ఆవిష్కరణ కొరకు స్థల సేకరణ గురించి వినతిపత్రం సమర్పించారు. స్థల సేకరణ కొరకు మున్సిపల్ కౌన్సిల్లో తీర్మానం చేసిన కాపీని కలెక్టరుకు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షులు పులిపాటి వెంకటేష్, అక్కల రామ సాయిబాబా, నారాయణ కౌన్సిలర్, సిలువేరి ప్రభాకర్, చిలువేరి సాయిబాబా, కాడికి రాము చిలివేరి సురేష్, నీలి వెంకటస్వామి, గడ్డం శ్యామ్, తిరుమల త్యాగరాజు, అక్కల శాంతారాం, మంత్రి సురేష్, అక్కల శ్రీనివాసులు, నామాల శ్రీకాంత్, రామకృష్ణ, రామస్వామి, పుట్ట రఘు, గట్టు శేఖర్, పగుడాకుల హనుమంతు, తిరుమల రవి తదితరులు పాల్గొన్నారు.
- 2 views