బచ్చన్నపేట సెప్టెంబర్ 26 ప్రజా జ్యోతి: స్వచ్ఛతాహి సేవ కార్యక్రమంలో భాగంగా సోమవారం వి ఎస్ ఆర్ నగర్ గ్రామంలో ర్యాలీ నిర్వహించి అనంతరం మహిళలకు తడి చెత్త, పొడి చెత్త పై అవగాహన కల్పించడం జరిగింది ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ కోనేటి స్వామి ఎంపీపీ నాగజ్యోతి కృష్ణంరాజు లు మాట్లాడుతూ గత మూడు సంవత్సరాలుగా గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ప్రతి ఇంటికి తడి చెత్త మరియు పొడి చెత్తను వేరు చేయుటకు మహిళలకు చెత్తబుట్టలు అందించడం జరిగిందన్నారు అట్టి వాటిని మహిళలు ఉపయోగించి గ్రామపంచాయతీకి చెత్తను అందివ్వడంతో ఐదు క్వింటాళ్ల సేంద్రియ ఎరువు తయారుచేసి అమ్మడం జరిగిందన్నారు సుమారు 6000 రూపాయలు గ్రామపంచాయతీకి ఆదాయం సమకూర్చడం జరిగిందన్నారు ఇకపై కూడా గ్రామస్తులు ఇలాగే సహకరించి గ్రామ అభివృద్ధికి సహకరించాలని కోరారు అనంతరం బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని మహిళలకు చీరల పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ చవాన్ నరేష్ వార్డు మెంబర్లు కృష్ణవేణి అనసూయ అన్నపూర్ణ రాజు సంజీవరెడ్డి యువజన సంఘం సభ్యులు ధనంజయకుమార్ పరమేష్ శ్రీకాంత్ మహేష్ మహిళా సంఘం సభ్యులు వాణిశ్రీ శారద స్వప్న రేణుక మహాలక్ష్మి హారతి కుమురమ్మ అనసూయ సావిత్రి చంద్రకళ మల్లవ్వ సత్యవా ఉమా తదితరులు పాల్గొన్నారు.
- 4 views