ఉత్తమ ఉపాధ్యాయుడికి సన్మానం

Submitted by kareem Md on Mon, 05/09/2022 - 15:39
Awarded to the best teacher
  • ఉత్తమ ఉపాధ్యాయుడుని సన్మానిస్తున్న జిల్లా మంత్రివర్యులు గుంటకండ్ల జగదీశ్వర్ రెడ్డి.

హలియా,సెప్టెంబర్05(ప్రజా జ్యోతి): తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులు 2022 సం లో భాగంగా నల్లగొండ జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయునిగా ఎంపికైన   అక్షయ హైస్కూల్,హాలియా కరస్పాండెంట్ షేక్ వహీద్ ని నల్లగొండ లో చిన వెంకట్ రెడ్డి ఫంక్షన్ హాల్ లో ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమానికి రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్వర్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై ఉత్తమ ఉపాధ్యాయుడిని శాలువా, మెమొంటో,ప్రశంసా పత్రంతో ఘనంగా సన్మానించారు. అనంతరం ఆయన ఉపాధ్యాయులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రభుత్వ ఉపాధ్యాయులకు దీటుగా ప్రైవేటు ఉపాధ్యాయులు ఎన్నిక కావడం హర్షించదగ్గ విషయమన్నారు.

ఈ కార్యక్రమానికి అతిథులుగా  శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి,రవీందర్ నాయక్,గాదరి కిషోర్, రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ ఎం.ఎల్.సి టి.ఆర్.ఎస్.పార్టీ రాష్ట్ర కార్యదర్శి తక్కెళ్లపల్లి రవీందర్ రావు, అడిషనల్ కలెక్టర్ భాస్కర్ రావు,నల్గొండ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ  అవార్డు గ్రహీత వహీద్ మాట్లాడుతూ ప్రైవేట్ ఉపాధ్యాయులను ప్రభుత్వం గుర్తించటం హర్షణీయమన్నారు,ప్రైవేటు ఉపాధ్యాయుల సేవలను గుర్తించి సన్మానించినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడుగా  ఎన్నికైనందుకు హాలియా పబ్లిక్ స్కూల్ ఆకాంక్ష హై స్కూల్ పాఠశాలల కరస్పాండెంట్ మేడిపల్లి మోహన్ రావు, ఉన్నం శ్రీనుబాబు,తడకమల్ల శ్రీనివాస్,మొదాల రవీందర్ పలువురు ఉపాధ్యాయులు శుభాకాంక్షలు తెలియజేశారు.