ఆటో అడ్డాలను ఏర్పాటు చేయాలి

Submitted by krishna swamy on Mon, 05/09/2022 - 16:03
Auto barriers should be installed
  • రోడ్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం

భూదాన్ పోచంపల్లి, సెప్టెంబర్ 06 (ప్రజా జ్యోతి) భూదాన్ పోచంపల్లి మండల కేంద్రంలో ఆటో కార్మికుల ఆటోలకు ప్రత్యేకంగా అడ్డాలను ఏర్పాటు చేయాలని రోడ్డు ట్రాన్స్పోర్ట్ డ్రైవర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి కల్లూరు మల్లేశం అన్నారు. ఆదివారం రోజున ఆటో కార్మికుల సమావేశం ఏర్పాటు చేసి కరపత్రాలను ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆటోలకు ప్రత్యేకంగా అడ్డా లేకపోవడంతో రోడ్డుమీద ఆటోలు నిలపడంతో దుకాణలదారులు వారిని ఇబ్బందులు పెడుతున్నారని అన్నారు.

మండల వ్యాప్తంగా అన్ని గ్రామాల ప్రజలను పోచంపల్లి పట్టణ కేంద్రానికి సురక్షితంగా ప్రయాణికులను చేరుస్తున్న ఆటోలకు అడ్డా స్థలాలు లేక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. వెంటనే సంబంధిత అధికారులు స్పందించి వారికి అడ్డాలను కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కన్వీనర్ మంచాల మధు,ఆటో కార్మికుల యూనియన్ మండల అధ్యక్షలు సిల్వెవేర్ నరసింహ,నాయకులు రాజేష్, లింగం,నరసింహ, భాస్కర్, లక్ష్మణ్, రాజేష్,బాలరాజు ,లింగం తదితరులు పాల్గొన్నారు.