ఉర్సు ఉత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు క్షేత్ర స్థాయి లో ఏర్పాట్లను పరిశీలించిన అధికారులు

Submitted by veerareddy on Sat, 17/09/2022 - 14:42
Armored arrangements for Ursu festival Officials who inspected the arrangements at the field level

 హనుమకొండ, సెప్టెంబర్16 (ప్రజాజ్యోతి) . ఈ నెల 19 నుండి 26 వరకు ఖాజిపేట దర్గా ఉర్సు ఉత్సవాలు జరుగనున్న సందర్భంగా శుక్రవారం ఉత్సవాల నిర్వహణ నోడల్ అధికారి అనిసుర్ రషీద్, ఇతర ఉన్నతాధికారులు క్షేత్ర స్థాయి లో పర్యటించి అవసరమైన ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్యక్రమానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలుగ కుండా నీటి సరఫరా, సరియైన లైటింగ్ ఏర్పాటు తో పాటు సివిల్ పనుల పూర్తి చేసేలా ఆదేశించడం జరిగిందని,అన్ని విభాగాల సిబ్బంది సమన్వయం తో ఉర్సు ఉత్సవాలను విజయవంతం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సి ఎం హెచ్ ఓ డా.జ్ఞానేశ్వర్, డి.సి.జోనా, అసిస్టెంట్ పోలీస్ కమీషనర్ ఏ.శ్రీనివాస్, ఈ.ఈ.లు రవికుమార్, సంజయ్ కుమార్, డి.ఈ.సంతోష్ బాబు, సానిటరీ సూపర్ వైజర్ పసునూరి భాస్కర్, సానిటరీ ఇన్స్పెక్టర్ లు కరుణాకర్,రవీందర్ తదితరులు పాల్గొన్నారు.