- మంత్రి గుంట కండ్ల జగదీశ్వర్ రెడ్డి
- వెబ్ సైటు ను ప్రారంభిస్తున్న మంత్రి జగదీశ్వర్ రెడ్డి.
హలియా,సెప్టెంబర్10(ప్రజా జ్యోతి); ఎకే ఫౌండేషన్ చైర్మన్ అనిల్ సేవలు అభినందన నియమని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంట కండ్ల జగదీశ్వర్ రెడ్డి అన్నారు.శనివారం హైదరాబాద్ మినిస్టర్స్ క్వార్టర్స్ లో ఆయన చేతుల మీదుగా వెబ్ సైటుని అవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నాగార్జున సాగర్ నియెజకవర్గంలో ఏకే ఫౌండేషన్ చైర్మన్ పలు సామాజిక కార్యక్రమాలు చేపట్టడం గ్రామీణ నిరుద్యోగ యువతి యువకులు పేద, మధ్యతరగతి వర్గాల కోసం పలు స్వచ్చంధ కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఎకే ఫౌండేషన్ చైర్మన్ కట్టెబోయిన అనిల్ కుమార్ యాదవ్ సేవలను ఆయన కోనియాడారు,గ్రామీణ యువత ఇలాంటి స్వచ్చంధ సంస్థ కార్యక్రమాలలో భాగస్వామ్యం అయి నెలకొల్పిన సంస్థ సేవలను విసృత్తం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ చైర్మన్ కట్టెబోయిన అనిల్ కుమార్ యాదవ్, గుండెబోయిన శ్రీనువాస్ యాదవ్ మాదగోని మల్లిఖార్జున్ గౌడ్,మన్నెం కోటేష్ తదితరులు పాల్గోన్నారు.