గద్వాల ప్రతినిధి (ప్రజా జ్యోతి) సెప్టెంబర్ 27: జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో రాజవీది లోని శ్రీ భక్త మార్కండేయ స్వామి దేవాలయంలో మంగళవారం అమ్మవారు అన్నపూర్ణాదేవి అవతారంలో దర్శనమిచ్చారు. ఉదయం సుప్రభాత సేవతో మొదలై అభిషేకం, కుంకుమార్చన జరిగాయి. "పరమశివునికి బిక్ష ఇచ్చిన మాత అన్నపూర్ణేశ్వర దేవి" అలంకారంలో దర్శనమిచ్చింది. ఈ అలంకారంలోని అమ్మవారిని దర్శించుకున్న వారికి మహా పుణ్యం అని అర్చకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి పట్టణ అధ్యక్షులు పులిపాటి వెంకటేష్, నారాయణ కౌన్సిలర్, చిలివేరి ప్రభాకర్, సాయిబాబా, కాడికి రాము, అక్కల రవి తదితరులు పాల్గొన్నారు.
- 3 views