"గ్రూప్ పరీక్షల సందర్బంగా పరీక్ష కేంద్రాలలో అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలి" --- జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటరావు

Submitted by Kramakanthreddy on Fri, 23/09/2022 - 12:49
"All necessary arrangements should be made in examination centers for group examinations" --- District Collector S. Venkatarao

మహబూబ్ నగర్, సెప్టెంబర్ 22 (ప్రజాజ్యోతి ప్రతినిధి) : వ చ్చే నెలలో నిర్వహించనున్న గ్రూప్-1 పరీక్షల నేపథ్యంలో గురువారం జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటరావు మహబూబ్ నగర్ పట్టణంలోని రిషి జూనియర్ కళాశాలలలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాన్ని  ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పరీక్ష కేంద్రం లో అందుబాటులో ఉన్న సీసీ కెమెరాల గదులు, సీసీ కెమెరాలు లేని గదులు, అభ్యర్థులు పరీక్ష రాసేందుకు వసతి, ఇతర సౌకర్యాలను పరిశీలించడమే కాకుండా, జూనియర్ కళాశాల యజమాన్యం తో మాట్లాడారు.  సీసీ కెమెరాలు లేని గదుల్లో తక్షణమే ఏర్పాటు చేయాలని, అభ్యర్థులు గ్రూప్-1 పరీక్ష రాసేందుకు ఏలాంటి ఇబ్బందులు ఉండకూడదు అని, ముఖ్యంగా అవసరమైన మౌలిక సదుపాయాలన్నింటిని పరీక్ష కేంద్రంలో కల్పించాల్సిన అవసరం ఉందని అధికారులను , నిర్వాహకులను ఆదేశించారు. తనతోపాటు  అదనపు కలెక్టర్లు, సీనియర్ అధికారులు కూడా పరీక్ష కేంద్రాలను తనిఖీ చేస్తున్నారని, జిల్లాలో గ్రూప్ వన్ పరీక్షలు పారదర్శకంగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలను చేపడతామని ఆయన తెలిపారు.