వీఆర్ఏల సమ్మెకు వ్యవసాయ కార్మిక సంఘం మద్దతు

Submitted by veerareddy on Fri, 23/09/2022 - 10:35
Agricultural Labor Union supports VARA strike

పెన్పహాడ్ మండలం సెప్టెంబర్ 22 (ప్రజా జ్యోతి):  వీ ఆర్ ఏ ల సమ్మె 60వ రోజుకు చేరిన సందర్భంగా, దీక్షా శిబిరాన్ని సందర్శించిన  తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి ధూళిపాళ ధనుంజయ నాయుడుమాట్లాడుతూ.సమ్మె చేస్తున్న వీఆర్ఏలకు వ్యవసాయ కార్మిక సంఘం తన సంపూర్ణ మద్దతు ఇస్తుందని, వీఆర్ఏలకు పే స్కేలు ఇస్తామని 2017లో సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రగతి భవన్ సాక్షిగా ప్రకటించారని, ఆ తర్వాత అసెంబ్లీలో కూడా రెండు సందర్భాలలో పే స్కేలు ఇస్తామని వాగ్దానం చేసి తీరా ఇప్పుడు వారిని సమ్మెబాట పట్టించారని, విరమించండి ఆ తర్వాత మాట్లాడకుందామని కేటీఆర్  ప్రకటించడం విడ్డూరంగా ఉందని  సమ్మె విరమించాక మాట్లాడు కోవటానికి ఏముంటుందని, ఆ మాట్లాడేది ఏదో ఇప్పుడే మాట్లాడి వీఆర్వోల న్యాయమైన కోరికలు  అంగీకరించి వారిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.వీఆర్ఏలలో ఎవరైనా దురదృష్టవశాత్తు మరణిస్తేవారి వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని,వారికి కూడా తహసిల్దార్ కార్యాలయంలో కూర్చోడానికి ఒక టేబుల్ కుర్చీ ఏర్పాటు చేయాలని, రాష్ట్రవ్యాప్తంగా పెట్టి చాకిరీ చేస్తున్న వీఆర్ఏలకు కనీస వేతన చట్టం ప్రకారం నెలకు 21 వేలు వేతనం ఇవ్వాలని  రాష్ట్రంలో వీఆర్వో వ్యవస్థ ఎత్తివేశాక గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు ఇతర ప్రజలకు అందుబాటులో ఉండి నిత్యం సేవలందించేది వీఆర్ఏ లని ప్రతి నెల మొదటి తారీకున వేతనం ఇవ్వాలని రెవెన్యూ వ్యవస్థలో క్షేత్రస్థాయిలో కీలకంగా పనిచేసేది వీఆర్ఏ లేనని తెలంగాణ రాష్ట్రం వస్తే తమ బాధలు తగ్గిపోతాయని అనే రంగాల ఉద్యోగులుఆశించారని, కానీ ఆచరణలో  సాధ్యం కాలేదని పాలకులు కల్లా బుల్లి మాటలు కట్టిపెట్టి వీఆర్ఏ సమస్యలు పరిష్కరించి అటు ప్రజలకు కలిగే ఇబ్బందులు కూడా తొలగించాలని ఆయన కోరారు.


 సంఘీభావం తెలిపిన వారిలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం సూర్యాపేట జిల్లా ఉపాధ్యక్షుడు రావుల సత్యంఉన్నారు.కాగా దీక్షా శిబిరంలో పెన్ పహాడ్  వీఆర్ఏల మండల అధ్యక్షుడు జానీ పాషా, ఉపాధ్యక్షుడు మధుసూదన్ గౌరవాధ్యక్షులు వెంకటయ్య, కోశాధికారి నాగయ్యప్రభాకర్,నగేష్,యాదగిరి,జానయ్య, బిక్కన్, రాణి, పిచ్చమ్మ  ఎల్లమ్మ ఉన్నారు.