ప్రజా జ్యోతి సూర్యాపేట జిల్లా ప్రతినిధి 24సెప్టెంబర్//''/// నమ్మదగిన సమాచారం మేరకు జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్ ఆదేశాలనుసారం జిల్లా పోలీస్ యంత్రాంగం ముమ్మర తనిఖీల భాగంగా హుజూర్నగర్ మోతే కోదాడ పోలీస్ స్టేషన్ పరిధిలో సుమారు 27 లక్షల విలువ గల గంజాయిని అధికారులు సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూమోతే పోలీస్ స్టేషన్ పరిధిలో 138 , హుజూర్ నగర్ పోలీస్ స్టేషన్, 93 కోదాడ పట్టణ పోలీస్ స్టేషన్ల పరిధిలలో 37 కేజీల గంజాయిను సీజ్ చేశామని తెలిపారు. అదేవిధంగా రెండు షిఫ్ట్ కార్లు ఒక ఐ20 కారును నిందితుల దగ్గర నుండి స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డిఎస్పి వెంకటేశ్వర రెడ్డి, బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ ,సోమనారాయణ సింగ్, సిఐలు శివశంకర్ ,ఆంజనేయులు, రామలింగారెడ్డి ఎస్సైలు తదితరులు పాల్గొన్నారు.
- 2 views