ఆర్టీసీ లో ప్రయాణం సురక్షితం

Submitted by veerareddy on Wed, 28/09/2022 - 09:03
Traveling in RTC is safe

పెన్ పహాడ్ మండలం సెప్టెంబర్ 27(ప్రజా జ్యోతి):  ఆర్టీసీలో ప్రయాణం సురక్షితమని స్టేషన్ ఇన్చార్జి నిర్మల అన్నారు ఆర్టీసీ ఎండి సజ్జనార్ ఆదేశాల మేరకు చెట్ల ముకుందాపురం గ్రామంలో సర్పంచ్ రాయిరాల శోభారాణి ఆధ్వర్యంలో "ప్రజల వద్దకు ఆర్టీసీ " పేరుతో గ్రామ సభ నిర్వహించడం జరిగింది,ఈసందర్బంగా సర్పంచ్ మాట్లాడుతూ చెట్లముకుందాపురం గ్రామానికి బస్సు సౌకర్యం లేదని మోడల్ స్కూల్ విద్యార్థుల సౌకర్యార్ధం  బస్సు  నడుపుతున్నారని  ఆ బస్సు   గాజుల  మల్కాపురం  చీదెళ్ల  మీదుగా  చెట్లముకుందపురం నుండి  పెన్పహాడ్  వెళ్లేవిదంగా  చర్యలు  చేసుకోవాలన్నారు అదేవిదంగా  ప్రయాణికుల  సౌకర్యార్ధం  అదనంగా  ఉదయం,  సాయంత్రం    మరొక  బస్సు  వేయాలని కోరారు  దీనికి వారు  రూట్  రోడ్డు  పరిశీలించి  బస్సునడిపిస్తామని  హామీ  ఇచ్చారు.  అదేవిదంగా  విద్యార్థులు  వికలాంగులు, వయో వృద్దులు,  విధిగా  పాసులు  తీసుకోవాలన్నారు.       ఈకార్యక్రమంలో మ్యారేజ్ బస్సు స్పెషల్ ఆపీసర్  సి ఆర్ సి  ఇంచార్జ్ రవికుమార్  బస్ పాస్ ల  ఇంచార్జ్ ఏకాంబరం వికలాంగుల బస్ పాస్ ల  ఇంచార్జ్  శ్రీ నివాస్ (9030380565) పాల్గొన్నారు.