నేరేడుచర్ల, అక్టోబర్ 2(ప్రజా జ్యోతి): గరిడేపల్లి మండలం లక్ష్మీపురం గ్రామపంచాయతీకి చెందిన తుమ్మకొమ్మ శివ కు ఉస్మానియా వైద్య కళాశాలలో ఎంబిబిఎస్ సీటు రాగా నిరుపేద కుటుంబం కావడంతో ఆర్థిక పరిస్థితిని అతని కుటుంబం సభ్యులు నేరేడు చర్ల మండలానికి చెందిన క్రాంతినికేతన్ స్వచ్ఛంద సేవ సంస్థ అధ్యక్షుడు సుంకర క్రాంతి కుమార్ ను సంప్రదించగా తన పుట్టినరోజు సందర్భంగాఆదివారం శివకు తక్షణ సహాయంగా10000 ఆర్థిక సహాయం అందించారు.అనంతరం క్రాంతి మాట్లడుతూ శివకు విద్య అవసరాన్ని బట్టి ముందు రోజుల్లో మా సంస్థ ద్వారా తమ వంతు సాకారం అందిస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో సభ్యులు సామాజిక కార్యకర్తలు జింకల భాస్కర్, కొప్పు రామకృష్ణ గౌడ్ యారావ సురేష్ , జంపాల శ్రావణ్ ,సైదులు, రాజేష్ లు పాల్గొన్నారు
- 1 view