మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించిన సర్పంచ్ సారంగపాణి

Submitted by bosusambashivaraju on Wed, 21/09/2022 - 13:28
Sarpanch Sarangapani visited the family members of the deceased

స్టేషన్ ఘనపూర్, సెప్టెంబర్ 21 ( ప్రజాజ్యోతి ) :-  ఘనపూర్ మండలంలోని చాగల్ గ్రామంలో పింగిలి కిష్టారెడ్డి  భార్య విమల దేవి  బుధవారం ఉదయం మరణించారు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక సర్పంచ్, మండల సర్పంచుల ఫోరమ్ అధ్యక్షుడు పోగుల సారంగపాణి వారి పార్థివ దేహాన్ని సందర్శించి,  పూలమాల వేసి నివాళులు అర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. వారితో పాటు టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఇనుగాల నరసింహారెడ్డి, మున్నూరు కాపు సంఘం నాయకులు,  గాండ్ల సమ్మయ్య, సౌదరాపల్లి,  సంపత్, టీఆర్ఎస్ గ్రామ శాఖ యూత్ అధ్యక్షులు పొన్న రాజేష్,  సోన్నయిల శ్రీను,  ఇతర నాయకులు, పార్టీ శ్రేణులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.