ఆపదలో ఉన్న వారిని కాపాడే ఆపద్బాంధవుడు

Submitted by veerareddy on Wed, 21/09/2022 - 12:46
 A protector who protects those in danger

 రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి

పెన్ పహాడ్ సెప్టెంబర్ 20 (ప్రజా జ్యోతి): మండల పరిధిలోని అనంతారం గ్రామ నివాసి యం. రాంబాబు తండ్రి బిక్షమయ్య అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు చికిత్స కోసం ఆర్థికంగా ఇబ్బంది పడుతుండడంతో  రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి దృష్టికి సమస్యను తీసుకెళ్లగా వెంటనే స్పందించిన మంత్రి 1,00,000 ,(ఒక్క లక్ష రూపాయలు ) లను సీఎం రిలీఫ్ ఫండ్ (LOC) ద్వారా మంజూరు చేయించి వారి కుటుంబానికి అండగా నిలిచారు. ఈ సందర్భంగా రాంబాబు కుటుంబ సభ్యులు మాట్లాడుతూ ప్రజల కష్టాల్లో సుఖాల్లో పాలుపంచుకునే నాయకుడు దొరకడం మన అదృష్టం అని చెప్పారుమాకు ఏ బాధ వచ్చినా ఏ కష్టం వచ్చిన నేను ఉన్న అనే ధైర్యం ఇచ్చిన మంత్రికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.